కర్నూల్ లో ఇటీవల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయిన విషాదం మరువకముందే… మరోసారి తెలంగాణ రోడ్లు రక్తంతో తడిసి ముద్దయ్యాయి. ఈ రోజు తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో — తాండూరు నుంచి సుమారు 70 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వైపు బయలుదేరిన ఆర్టీసీ బస్సు ను — ఎదురుగా వచ్చిన కంకర లోడ్ చేసిన టిప్పర్ ఢీకొన్న ఘటనలో సుమారు 20 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘోరం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళనకు గురిచేసింది.
సంతాపం – విజ్ఞప్తి
ఈ ప్రమాద వార్త తెలియగానే మోడీతో సహా పలువురు, ముఖ్యమంత్రి, జాతీయ ,రాష్ట్ర స్థాయి నాయకులు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యసేవలు తక్షణం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి.
Thank you for reading this post, don't forget to subscribe!తీవ్రమైన ప్రశ్నలు
ఈ ఆర్టీసీ ప్రమాదానికి నిజమైన కారణం ఏంటి? ఎవరి నిర్లక్ష్యం? ఎక్కడ వైఫల్యం జరిగింది? ఈ ప్రశ్నలకు సాక్ష్యాధారాలతో సమాధానం వచ్చే వరకు ఈ ఘటన ప్రశ్నార్థకంగానే నిలుస్తుంది.
దర్యాప్తు – చర్యలు కావాలి
ఈ ప్రమాదానికి కారణమైన వారిపై పూర్తి స్థాయి నిష్పాక్షిక దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా — ప్రభుత్వం ప్రమాద ప్రాంతాలను గుర్తించి, రోడ్డు భద్రత చర్యలను అత్యవసరంగా బలపరచాలి.
రహదారి పనుల వివాదం
కొంతమంది నాయకులు ఈ రహదారి 2015-16 లోనే నేషనల్ హైవేగా మారాల్సి ఉన్నప్పటికీ కేసులు – పరిపాలనా అడ్డంకులు – నిర్లక్ష్యం కారణంగా పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఈ మార్గంలో వరుస ప్రమాదాలపై నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ స్పందన – కంట్రోల్ రూమ్
ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నారు. సహాయక చర్యల పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు.
హెల్ప్లైన్ నంబర్లు:
9912919545
9440854433
https://www.tgsrtc.telangana.gov.in/
-BY VEERAMUSTI SATHISH,MAJMC
READ MORE:

