తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ అమలుపై ప్రభుత్వం వేగం పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల శ్రేయస్సు కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, రైతు రుణమాఫీ విధానాలను ఖరారు చేసే దిశగా అధికారులను దిశానిర్దేశం చేశారు.
2 లక్షల వరకు రైతు రుణమాఫీ:
రైతులకు గరిష్టంగా ₹2 లక్షల వరకు రుణమాఫీ లభించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
మొదటి దశలో – ₹1 లక్ష వరకు రుణమాఫీ
రెండో దశలో – ₹1.5 లక్షల వరకు
చివరి దశలో – ₹2 లక్షల వరకు మాఫీ చేయాలని నిర్ణయించారు.
రుణమాఫీ కాలపరిమితి;
రేవంత్ ప్రభుత్వం స్పష్టంగా తెలిపిన ప్రకారం:
2019 ఏప్రిల్ 1 నుండి 2023 డిసెంబర్ 10 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలు ఈ మాఫీ పరిధిలోకి వస్తాయి.
ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యం అయినా, ఇప్పుడు ఆగస్టు 15, 2025లోపు రుణమాఫీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఎవరికీ రుణమాఫీ లభిస్తుంది?
5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులు మాత్రమే అర్హులు.
ఆదాయపు పన్ను చెల్లించే రైతులు మాఫీకి అర్హులు కాని అవకాశం ఉంది.
తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో, ఒక్కరికి మాత్రమే ఈ సౌకర్యం వర్తించనుంది.
రైతుల ఆశలు – ప్రభుత్వ ప్రయత్నాలు:
రాష్ట్రవ్యాప్తంగా రైతులు రుణమాఫీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం, అధికారులు వేగంగా కసరత్తు చేస్తూ, సాధ్యమైనంత త్వరగా రైతు రుణమాఫీ అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారు.
https://agri.telangana.gov.in/content.php?U=14%20&&%20T=About%20Us
By Veeramusti Sathish
M.A. (Journalism & Mass Communication), M.A. (Political Science)
Independent Digital Journalist & RTI Activist | Founder – Prathipaksham TV

