Author: Veeramusti Sathish, MAJMC

Independent journalist, RTI activist & founder of PrathipakshamTV.com, specializing in legal and investigative reporting.

వైఎస్సార్‌సీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాకిచ్చారు. డిసెంబర్ 28 పార్టీలో చేరిన రాయుడు 10 రోజుల తిరక్కుండానే సంచలన ట్వీట్ చేశారు. తాను వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ‘ఎక్స్’ ద్వారా తెలిపారు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, క్రికెట్ అభిమానుల్లోనూ ఇది చర్చనీయాంశంగా మారింది.గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు గత కొంత కాలంగా రాజకీయాల మీద ఆసక్తి కనబరిచారు.వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. సీఎం జగన్‌కు మద్దతుగా పలుమార్లు ట్వీట్స్ కూడా చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడుని పార్టీలో చేర్చుకోవటం వల్ల వైసీపీ బలపడుతుందని భావించింది అనుకున్నట్లుగానే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక సీఎం జగన్‌ను కలిసిన రాయుడు పలు సంఘాలతో సమావేశమయ్యారు. అనంతరం డిసెంబర్ 28 న తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు.ఆయనకు గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. త్వరలోనే…

Read More

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్కు సుమారు వందేళ్ల చ‌రిత్ర ఉంది,సుదీర్ఘ చ‌రిత్ర‌తో పాటు నిర్దిష్ట కాల‌ప‌రిమితిలోనే నోటిఫికేష‌న్‌లు, ప‌రీక్ష‌లు, ఇంట‌ర్వ్యూల నిర్వ‌హ‌ణ‌, నియామ‌క ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌డం అన్నింటా పార‌ద‌ర్శ‌క‌తను పాటిస్తోంది. ఈ విష‌యంలో మేం యూపీఎస్సీకి అభినంద‌న‌లు తెలుపుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ)ను ఆ విధంగానే రూపొందించాల‌ని తాము నిర్ణ‌యించుకున్నామ‌ని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి యూపీఎస్సీ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ మ‌నోజ్ సోనికి తెలిపారు. న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాల‌యంలో యూపీఎస్సీ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ మ‌నోజ్ సోని, కార్య‌ద‌ర్శి శ్రీ శ‌శిరంజ‌న్ కుమార్‌ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి శ్రీ ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా టీఎస్‌పీఎస్సీ ప్ర‌క్షాళ‌న‌, యూపీఎస్సీ ప‌ని తీరుపై సుధీర్ఘంగా చ‌ర్చించారు. యూపీఎస్సీ పార‌ద‌ర్శ‌క‌తను పాటిస్తోంద‌ని,అవినీతి మ‌ర‌క అంట‌లేద‌ని, ఇంత సుదీర్ఘ‌కాలంగా అంత స‌మ‌ర్థంగా యూపీఎస్సీ ప‌నిచేస్తున్న తీరుపై ముఖ్య‌మంత్రి ఆరా తీశారు. తెలంగాణ‌లో నియామ‌క…

Read More

రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని గురువారం రాత్రి ప్రజాభవన్లో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో చిరంజీవి సత్కరించారు. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి భట్టి విక్రమార్క సత్కారం చేశారు. డిప్యూటీ సీఎం వెంట ఆయన సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు.

Read More

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో జరిగింది.ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నటి ప్రభ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో దాదాపు 150 నుంచి 200 చిత్రాల్లో నటించారు. స్వర్గీయ దేవభక్తుని రమేష్, ప్రభ దంపతుల కుమారుడైన రాజా రమేష్ ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. విజయవాడ వాస్తవ్యులు స్వర్గీయ విజయ్ రామ్ రాజు వేదగిరి, శిరీష దంపతుల కుమార్తె సాయిఅపర్ణతో రాజా రమేష్ వివాహం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, మురళీమోహన్, విక్టరీ వెంకటేష్, సాయికుమార్, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ కృష్ణ, నిర్మాత దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, బోయపాటి శ్రీను, బెల్లంకొండ సురేష్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సుమన్, మల్లిడి సత్యానారాయణ రెడ్డి, రాశిమూవీస్ నరసింహారావు, దర్శకుడు రేలంగి నరసింహారావు, రోజారమణి, అన్నపూర్ణమ్మ, రజిత, కృష్ణవేణి, శివపార్వతి,…

Read More

తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. • మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. • నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం. • ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశాం. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలి అన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష. • యువత భవిత మాకు ప్రాధాన్యం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి… వారి భవిష్యత్ కు గ్యారెంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నాం. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. • రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం.ఈ నూతన సంవత్సరం ‘రైతు – మహిళ – యువత…

Read More

• నిరుడు రూ.14 వేలు ధర పలికిన క్వింటాలు పత్తి• ఇప్పుడు ప్రభుత్వ మద్దతు ధర రూ. 7,020• సాకులు చెబుతూ ధరలో కోతలు• రూ.6,500 మాత్రమే పెడుతున్న ప్రైవేటు వ్యాపారులు వరంగల్ :నిరుడు రికార్డు స్థాయిలో పత్తికి 14000 ధర పలకడంతో ఈ సంవత్సరం రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపారు కానీ ఈసారి మాత్రం ఏడు వేలే ధర ఉండడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఎకరా పత్తి సాగుకు సగటున రూ.30 నుంచి రూ.40 వేలు పెట్టుబడి,పత్తి ఏరుడుకు 15000 లు మొత్తం 50000 ఖర్చవుతుంది.ఎకరాకు 5-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన రైతుకు పెట్టిన పెట్టుబడి పోను ఏమి మిగిలే అవకాశం లేదు ఇక కౌలు రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి నష్టాల పాలు అయ్యారు ఈ నేపద్యంలో రూ.10 వేలుగా ప్రకటించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read More

బిఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సియం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ సినీ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ.

Read More

తెలంగాణలోని ప్రతి పంచాయతీల్లో బడి ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో శనివారం జరిగిన విద్యాశాఖ సమీక్షలో అన్నారు. రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన,మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువులకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు.విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలను తిరిగి తెరిపించాలి . ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే’ అని రేవంత్ రెడ్డి ఆదే చారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను భర్తీకి చర్యలను తీసుకోవాలని,రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ కాళీలను భర్తీ చేయడానికి డీఎస్సి నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఊరు,మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ…

Read More

జబర్దస్త్ తో తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు.సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డాలీషా హీరోయిన్‌గా న‌టిస్తోంది.ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. న‌టీన‌టులు:సుధీర్ ఆనంద్ బయానా, డాలీషా, శివబాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల త‌దిత‌రులు.

Read More

ఎస్బీఐలో 8283 క్లర్క్‌ ఉద్యోగాలు:SBI Clerk 2023 Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)నవంబర్ 16 న క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 8773 ఖాళీల కోసం రిక్రూట్‌మెంట్ చేస్తోంది..జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్)గా చేరాలనుకునే ఆసక్తి గల ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Read More