ప్రజాభవన్లో ఆత్మీయ భేటీ
హైదరాబాద్: రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని గురువారం రాత్రి ప్రజాభవన్లో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు.
Thank you for reading this post, don't forget to subscribe!చిరంజీవికి శాలువా సత్కారం
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిరంజీవిని కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో సత్కరించారు. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి గౌరవం తెలిపారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో
భట్టి విక్రమార్క వెంట ఆయన సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు. ఈ సమావేశం ఆత్మీయ వాతావరణంలో సాగింది.


