• కవితకు ఈడి సమన్లతో బీఆర్ఎస్ లో ఆందోళన
Thank you for reading this post, don't forget to subscribe!• ఇంకా సుప్రీంకోర్టులో లిస్ట్ కాని కవిత పిటీషన్
• న్యాయవాదులతో చర్చిస్తున్న కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది.ఇప్పుడు ఇది బీఆర్ఎస్ లో ఆందోళన కలిగిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఈ నోటీసులు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.
గతంలోనూ కవితను ఈడీ మూడు సార్లు విచారించింది. తాజాగా.. మరోసారి విచారణకు రావాలంటూ కవితకు నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్ లోనే ఉంది. అయితే ఈడి విచారణకు హాజరు గురించి కవిత తన న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు సమాచారం.